మైలార్దేవ్పల్లి :శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో చిన్నారులు రాధకృష్ణుని వేషాధరణతో అలరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గోపిక,కృష్ణులుగా అలకంరించి స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్కండేయనగర్ కాలనీలో సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అంత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉట్టి కొట్టెందుకు పోటీ పడ్డారు. కార్యక్రమంలో నవోదయ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.