మైలార్దేవ్పల్లి : గణనాధుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.శుక్రవారం ఉదయం నేతాజీ నగర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండప నిర్వహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డించారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వారికి విఘ్నాలను తొలగిస్తాడని అన్నారు. డివిజన్ ప్రజలు ఆనందంగా గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని మండప నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ ,టీఆర్ఎస్ నాయకులు మాధవరెడ్డి, సుధాకర్గౌడ్ , వెంకటేష్ , యంజాల రాజు తదితరులు పాల్గొన్నారు.