శేరిలింగంపల్లి :క్రియ ఫౌండేషన్, సహృదయ పౌండేషన్ల సంయుక్త అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆదివారం శేరిలింగంపల్లిలోని పవిత్ర స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీయుడబ్ల్యుజే సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ శిభిరంలో బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, బీఏంఐ, ఫల్స్ అక్సిజన్ లెవెల్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయుడబ్ల్యుజే) రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, సీనియర్ న్యూరాలజిస్టు, సిద్ధార్థ హాస్పిటల్స్ ఏండీ డాక్టర్ సిద్దార్థ రెడ్డి, టీఏఎంజేయు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, కోవిద సహృదయ వ్యవస్ధాపకులు డాక్టర్ అనూహ్య రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి, పవిత్ర విద్యాసంస్ధల ఛైర్మన్ వెంకటేష్లు హాజరయ్యారు.
టీయుడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, పులి అమృత్గౌడ్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్సాగర్, ప్రధానకార్యదర్శి మెట్టు జంగారెడ్డి, టీఏఎంజేయు అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు సాగర్ గౌడ్, కిశోర్, జర్నలిస్టు ప్రతినిధులు వినయ్ కుమార్, భిక్షపతి, నారాయణ, ఎల్లేష్లతో పాలు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.