చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ పార్క్ వద్ద మహాత్మాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, నాయకుడు ముఠా నరేశ్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఆకుల శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, వెంకటేశ్, జీవై గిరి, పాశం రవి, రాజ్కుమార్, హన్మంతు, ఎం.దేవయ్య, సురేశ్, పద్మ సూర్య ప్రకాశ్, తుడం లక్ష్మి, ముచ్చకుర్తి పద్మ, పద్మ, భాగ్యలక్ష్మి, చందు తదితరులు పాల్గొన్నారు.