బడంగ్పేట : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ కమిటీని ఎన్నుకొని మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి మేయర్ దుర్గా దీప్లాల్ హన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి,కార్పొరేటర్స్కు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డు స్థాయి నుంచి నూతన కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టం చేయడానికి అందరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలలోకి తీసుక పోవాలని ఆమె అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో పార్టీ కమిటీలు వేయాలన్నారు. పూర్తి స్థాయి కమిటీలు వేసిన తర్వాత కార్పొరేషన్ కమిటీ వేద్దామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మీర్పేట మున్సిల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్స్ తదితరులు ఉన్నారు.