బండ్లగూడ : అగ్నిప్రమాదంలో సినిమా షూటింగ్ సామగ్రి తగల బడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్ సాగర్ ప్రాంతంలో సినిమా షూటింగ్కు సంబంధించిన సామాగ్రిని భద్ర పరిచారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.