కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం కందుకూరు గ్రామానికి చెందిన ఎగ్గిడి పెద్ద ఐలయ్య, కందడి చిన్న చంద్రయ్య, పాముల బాలయ్య, ఎగ్గిడి సత్తయ్య, ఎగ్గిడి గణేష, ఎగ్గిడి అనీల్లు ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వాహించే బీరప్ప జాతరకు మంత్రిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అన్ని పండుగలకు ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. కొన్ని పార్టీలు మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాయని వారి పట్ల ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని మతాల వారీని గౌరవిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, చిర సాయిలు, డైరెక్టరు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రసిడెంట్ తాళ్ల కార్తీక్, డైరెక్టరు సురుసాని శేఖర్రెడ్డి, ఎంపీటీసీలు కాకి రాములు, సురేష్, సర్పంచ్లు ఈర్లపల్లి భూపాల్రెడ్డి, పరంజ్యోతి, గంగాపురం గోపాల్రెడ్డి, చంద్రశేఖర్, నర్సింహ, లు పాల్గొన్నారు.