మారేడ్పల్లి : తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతి ఏడాది చీరలను అందజేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న తెలిపారు. మంగళవారం మోండాడివిజన్ పరిధి రెజి మెంటల్బజార్లోని హిల్స్ట్రీట్ ప్రభుత్వపాఠశాలలో మహిళలకు బతుకమ్మచీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ హయాంలోనే తెలుగు పండుగలకు ప్రాధాన్యత లభించిందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అర్హులందరికీ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా అన్ని మతాల వారికి సమాన అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్. శ్రీనివాస్, జీహెచ్ఎంసి మా జీ కో ఆప్షన్ సభ్యుడు సిఎన్. నర్సింహ్మముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు సి. చంద్రకుమార్,పిట్ల నాగేష్ ముదిరాజ్, ఒదెల అజేయ్, అశోక్, కసిరెడ్డి నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.