బడంగ్పేట: కరోనా మహామ్మారిని తరిమి కొట్టాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలోని దేవేందర్నగర్ కాలనీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాను సారంగా మొబైల్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. భారత గ్రామ నవ నిర్మాణ మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 800 మందికి వ్యాక్సినేషన్ వేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యయన్నారు. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ను సమర్ధవంతంగా ఎదుర్కున్నదని తెలిపారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. తప్పని సరిగా మాస్క్లు పెట్టుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కౌన్సిలర్స్ బోధ యాదగిరి రెడ్డి, మారి సంస్థ కోఆర్డినేటర్ సిల్వేరు సాంబ శివ, తదితరులు ఉన్నారు.