చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లయన్ డాక్టర్ అరిగపూడి విజయ్కుమార్ జన్మదిన సందర్భంగా ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏవీకే చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ హైదాబాద్ ఈస్ట్, భాంజి ఖేరాజ్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవ తత్వంతో సమాజంలో తోచిన విధంగా సేవాలందించాలని సూచించారు. సేవా పరాయణుడు అరిగపూడి విజయ్కుమార్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి, లంబ గ్రూప్ ఆప్ కంపెనీస్ అధినేత రాజ్ దీర్ సింగ్, అరిగ పూడి విజయ్కుమార్ సతీమణి కృష్ణకుమారి, డాక్టర్ విజయలక్ష్మి, ట్రస్ట్ అధ్యక్షడు వై.ఎస్.రామకృష్ణ కుమార్, నల్ల గిరి, శ్రీరామ్ దత్తి తదితరులు పాల్గొన్నారు.