అమీర్పేట్ : బల్కంపేట శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ దసరా శరన్నవరాత్రోత్సవాలు ఈ నెల 7 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్తో కలిసి నిర్వహించిచ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజలతో దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయని, 15వ తేదీ వరకు వేడుకలు కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
అమ్మవారు ప్రతి రోజూ ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని, చెబుతూ 13వ తేదీన జరిగే బతుకమ్మ వేడుకలు హైలైట్గా నిలిచేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దేవాలయం ఎదుట నిర్మించిన షెడ్డు కింద దాదాపు 1500 మంది మహిళలతో ఈ వేడుకలు నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి సభ్యుల తోడ్పాటుతో ఏర్పాట్లు జరుగుతు న్నాయని తెలిపారు. కరోనా నిబంధనల మేరకు వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.
భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో దేవాలయ పాలక మండలి సభ్యులు బీ.ఆర్.నారాయణరాజు, అశోక్యాదవ్, హనుమంతరావు, సింగారి శ్రీనివాస్ గుప్తా, ఉమానాథ్గౌడ్, ఆంజనేయులుయాదవ్, పుట్టల శేఖర్, కట్టా బలరామ్, కాసాని సహదేవ్గౌడ్, దేవాలయ ఎక్స్ అఫిషియో అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దాతల చేయూతతో…
బల్కపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలో నిర్మించ తలపెట్టిన మల్టీ పర్పస్ పార్కింగ్ కాంప్లెక్స్ టెండర్ల ప్రక్రియ 7వ తేదీ జరుగుతుందని వారు తెలిపారు. దాదాపు 1600 గజాల స్థలంలో నిర్మితమవుతున్న ఈ కాంప్లెక్స్లో భక్తుల వాహనాల పార్కింగ్తో పాటు భక్తులకు ఉపయోగపడే దుకాణాలు, విశ్రాంతి గదులతో పాటు డార్మిటరి వసతులు ఉంటాయని తెలిపారు. ఈ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్న డార్మిటరి నిర్మాణాలకు దాతగా వ్యవహరించేందుకు ఎస్ఆర్నగర్లోని సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు ముందుకు వచ్చారని తెలిపారు.