బంజారాహిల్స్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీనటుడు దుల్కర్ సల్మాన్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కులో బుధవారం మొక్కలు నాటారు.
బాలీవుడ్ హీరోయిన్ అదితీరావు హైదరీ విసిరిన గ్రీన్ చాలెంజ్ను స్వీకరించిన తాను మొక్కలు నాటినట్లు దుల్కర్ సల్మాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.