బొల్లారం : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం త్రిశూల్ పార్కు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాంలో రిసాల బజార్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్లు పంపీణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్, మాజీ సభ్యుడు లోక్నాథ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ..విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు.
తిరుమలగిరి గాంధీనగర్లో టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, ప్రధాన కార్యదర్శి ఉమేష్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ చిన్నా, మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.