ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ రంజాన్తో పాటు క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం తరపున కానుకలను అందజేస్తున్న కేసీఆర్ కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.