మియాపూర్ : శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ప్రతి ఒకరు అభివృద్ధి పనుల్లో భాగంగా అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీ సూచించారు.
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమత సమక్షంలో ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, వివేకనంద నగర్, కూకట్పల్లి డివిజన్ డివిజన్ల పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనుల స్థితిగతులపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస్ రావుతో పాటు కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేవాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి మంజూరు అయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని పనిచేసే వారికి పనులను అప్పగించాలని కోరారు.
ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పర్యటించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి తాసీల్దార్ గోవర్ధన్, కూకట్పల్లి ఉపకమీషనర్ రవీందర్, జీహెచ్ఎంసి ఎస్ఈ చిన్నారెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ సుభాష్, రాజీవ్, టౌన్పానింగ్ జోన్ ఏసిని రఘునందన్, ఇరిగేషన్ ఏఈ విశ్వం తదితరులు పాల్గొన్నారు.