చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్డు, నూతన డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ రవిచారితో కలిసి పనులను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందకు ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని అన్నారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా ఎన్నికల సమయంలోనే పోటీ ఉండాలి తప్ప అభివృద్దిలో కాదని ఆయన నాయకులకు సూచించారు. నియోజకవర్గం అభివృద్ది నిధుల నుంచి అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కట్టుగా పనిచేసి నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. కార్పొరేటర్ రవి చారి మాట్లాడుతూ అభివృద్దికి తాము సహకారం అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, వాటర్ వర్క్ మేనేజర్ జీవన జ్యోతి, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.మోజస్, ఎం.దామోదర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.వివేక్, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్ కిషన్ రావు, కోటేశ్వర రావు, జయదేవ్, ఎయిర్టేల్ రాజు, స్థానిక బస్తీ నాయకులు విష్ణు, బీజేపీ నాయకులు గడ్డం నవీన్, కిరణ్, గోపి, తదితరులు పాల్గొన్నారు.