బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్లో డివిజన్ కార్పొరేటర్ మహేశ్శరిశ్రీహరి ఆధ్వర్యంలో బేగంపేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీ సభ్యుల సమావేశం, ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదవరం కృష్ణారావు పాల్గొన్నారు. బేగంపేట్ నూతన డివిజన్ అధ్యక్షుడు పొన్నబోయిన సురేశ్యాదవ్తో పాటు డివిజన్ కమిటీల సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బేగంపేట్ డివిజన్లో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రస్తుత అత్యాధునిక హంగులతో శ్మశాన వాటిక రూపు దిద్దుకుంటుందని తెలిపారు. అలాగే డివిజన్లో ముంపు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు.
డివిజన్ నూతన అధ్యక్షుడు సురేశ్యాదవ్ మాట్లాడుతూ.. స్థానికంగ ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ అభివృద్ధి, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.