మణికొండ : మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్లోని దేవాదాయ శాఖకు చెందిన భూమిలో కొన్నాళ్లుగా కొనసాగు తున్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, టౌన్ప్లానింగ్ అధికారి రాకేశ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
షిరిడీసాయి నగర్లో ఓ బిల్డర్ జీ ప్లస్ 5 అనుమతులు పొంది అదనంగా పెంటౌస్ నిర్మించడంతో దానిని అధికారులు కూల్చివేశారు. కమిషనర్ ఫల్గుణ్కుమార్ మాట్లాడుతూ మణికొండలో అక్రమ నిర్మాణాల చిట్టాను పూర్తిస్థాయిలో పరిశీలించి దశలవారీగా కూల్చివేతలు చేపడుతున్నామన్నారు.