కవాడిగూడ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర సర్వేలో భాగంగా భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్, లాల్ బహదూర్ శాస్త్రీ కమ్యూనిటీ హాల్, బొంతల బస్తీ తదితర ప్రాంతాల్లో వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటా తిరిగి బాధితులకు మందులు అందజేశారు.
ముందుగా బైబిల్ హౌస్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించా లన్నారు.
దవాఖాన పీహెచ్ఎన్ వనిత, ఏఎన్ఎంలు లక్ష్మీబాయి, యాదమ్మ, సుహాసిని, లత, ల్యాబ్ టెక్నీషియన్ స్వరణ్, ఆశవర్కర్లు చాంద్ సుల్తానా, కృష్ణవేణి, ప్రేమలత, షాహీదాబేగం టీఆర్ఎస్ భోలక్పూర్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు జునేద్ బాగ్దాది, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.