మారేడుపల్లి : ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ బుధవారం మారేడుపల్లి లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దుర్గాదేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో నిర్మిస్తున్న కళ్యాణ మండపం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఆలయం మరింత అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన సుధాకర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవును శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సి. సంతోష్యాదవ్, పద్మజ, భువనేశ్వరి, వేణుగోపాలచారి, చొల్లేటి రమేష్, ఈఓ సుధాకర్, ప్రధాన అర్చకులు టి. రాజేశ్వర శర్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.