అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయనను అత్తాపూర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కలిసి డివిజన్కు సంబంధించి పలు సమస్యలను విన్నవించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉండటంతో అన్ని కాలనీలలోపారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని నాయకులు ఎమ్మెల్యేకు తెలిపారు. పలు బస్తీలలో సీసీ రోడ్ల సమస్య ఉందని, హైదర్గూడ సిరిమల్లెకాలనీలోని బాపుఘాట్ ప్రాంతంలో మంచినీటి పైప్లైన్లు లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని నాయకులు తెలిపారు.
మూసీ కాలువ పొడవున రక్షణ గోడను ఏర్పాటు చేయాలని రక్షణ గోడ లేకపోవడంతో మూసీ చెత్త,చెదారానికి నిలయంగా మారుతోందని, రాత్రి వేళల్లో దూర ప్రాంతాల నుంచి మట్టిని చ్తెతను తీసుకువచ్చి మూసీలో డంపింగ్ చేస్తున్నారని ఫలితంగా మూసి మూసుకు పోతుందని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దసర పండుగ వరకు అత్తాపూర్ గ్రామంలో బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా కొలనును ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే బస్తీ, కాలనీలలో తిరిగి నేరుగా సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.
మూసీ పరిరక్షణకోసం సంబంధిత అధికారులతో మాట్లాడి రక్షణ గోడను నిర్మించేలా చర్యలు తీసుకుంటానని, మూసీలో డంపింగ్ జరగకుండా రెవెన్యు అధికారులకు చెప్పి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. అత్తాపూర్ డివిజన్లో అభివృద్ది పనుల కోసం ప్రతిపాదనలు పంపామని త్వరలోనే అభివృద్ది పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని నాయకులు కూడ పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్రెడ్డి, చెరకు అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, టిఆర్యస్వీ గ్రేటర్ కోఆర్టినేటర్ శ్రీధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ వార్డు కమిటి సభ్యులు సురేష్రెడ్డి, మహేష్, నాయకులు సత్యారాయణగౌడ్, సంతోష్, శేఖర్ , నరేష్, శంకర్, తదితరులు పాల్లొన్నారు.