బడంగ్పేట,ఆగస్టు5ః బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల పదవి కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా కోఆప్షన్ సభ్యులు సమాఖ్య జ్యోతి అశోక్, గుర్రం ప్రసన్న వెంకట్రెడ్డి, రఘునందనా చారి, ఖలీల్ పాషా గురువారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని,బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రికి పూల బోకే అందజేశారు. కోఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోఆప్షన్లకు నిధులు కెటాయించే విధంగా సహాకరిస్తే ప్రజలకు సభ్యులపై నమ్మకం పెరుగుతుందన్నారు.