శంషాబాద్ రూరల్ : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య రూ. 2 లక్షల చెక్కుతో పాటు పలువురు బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.