మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు ఆసరా లాంటిదని తుక్కుగూడ వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి అన్నారు. తుక్కుగూడకు చెందిన దేశ్యనాయక్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు ధరఖాస్తు చేసుకోగ అతనికి సీఎం సహాయ నిధి నుండి 60 వేల రూపాయలు మంజూరు అయ్యాయి.
అట్టి చెక్కును వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి చేతుల మీదుగా తుక్కుగూడలో ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.
సంక్షోభంలోను సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, మురళీగౌడ్, ధీమంత్రెడ్డి, గొరిగె మహేష్, శ్రీకాంత్రెడ్డి, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.