సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర్ ఫరూక్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.75వేల విలువైన ఎల్వోసీ పత్రాలను తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి ఆయన అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్తో పాటు నేతలు రామచందర్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.