గోల్నాక : వివిద వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవఖానాలో చికిత్స పొందుతున్న అంబర్పేట తిలక్నగర్కు చెందిన జి.కృష్ణమూర్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2లక్షల విలువగల ఎల్వోసీ పత్రాన్ని ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.