ఎల్బీనగర్ : పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాణ్యమైన వైద్యం అందేందుకు దోహదం అవుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. బుధవారం చైతన్యపురి డివిజన్ గణేష్ఫురి కాలనీవాసులు బి. రూపావతికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్గా రూ. 17,500 చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందజేశారు.
ఈ సందర్భంగా దయానంద్ గుప్తా మాట్లాడుతూ ఎంతో మంది పేదలు అధునాతన వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూతను అందుకుంటున్నారని అన్నారు. పేదలకు సీఎం రిలీప్ ఫండ్ గొప్ప వరమని అన్నారు. ఈ కార్యక్రమం లో బొగ్గారపు శరత్చంద్ర, సిద్దు, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.