అమీర్పేట : అత్యవసర సమయాల్లో నిరుపేదల వైద్యానికి సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్కు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 3.17 లక్షల మొత్తం మంజూరైంది. గురువారం ఉదయం మంత్రి తలసాని మారేడ్పల్లిలోని తన నివాసంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం సహాయ నిధి కింద అత్యవసర సమయాల్లో ఎల్వోసీ ద్వారా ముందస్తు ఆర్ధిక సహాయాలు కూడా మంజూరవుతున్నాయని, ప్రభుత్వం నుండి ఇంతటి భరోసా గతంలో ఎన్న డూ చూడలేదని ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు హనుమంత రావు, ప్రధాన కార్యదర్శి మణి సంతోష్కుమార్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు కూతురు నర్సింహ పాల్గొన్నారు.