ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పేద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధైన, సంక్షేమమైనా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రజలు గ్రహించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అదే విధంగా కరోనా మహమ్మారి తొలగిపోయి, థర్డ్వేవ్ రావద్దని ఆంజనేయ స్వామివారికి మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గుప్తా దంపతులకు స్వామివారి చిత్ర పటాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జగిని రమేష్గుప్తా, మంచుకొండ సురేందర్గుప్తా, బి.రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు