ఆర్కేపురం : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్కు చెందిన ముదాసిర్ అహ్మద్ ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. అందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడంతో అహ్మద్ కుటుంబ సభ్యులు స్థానిక టీఆర్ఎస్ నాయకులను సంప్రదించారు. ఈ విషయాన్నిమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు.
సీఎం సహాయనిధి నుంచి రూ. 19,500ల చెక్ వచ్చింది. వచ్చిన చెక్కును బాధితుడుకి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ శర్మ, నాయకులు సాజిద్, పగిళ్ల భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.