మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన ముంతాజ్ బేగంకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 44 వేల ఆర్థిక సాయం చెక్కును విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం వివేకానందనగర్లోని తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు భరోసాగా నిలుస్తున్నదన్నారు. ఆర్థిక స్థితి లేక అనారోగ్యాల బారిన పడుతున్న వారెందరినో ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటూ కార్పొరేట్ వైద్యం పొందేందుకు దోహదపడుతున్నదన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఉపయోపడుతూ తన నిరంతర సేవలను కొనసాగిస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, శ్రావణిరెడ్డి పాల్గొన్నారు.