ఆర్కేపురం : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్-2 సాయిబాబానగర్కు చెందిన సత్యనారాయణ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్కు తెలిపాడు.
ఈ విషయాన్ని ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిమ్స్లో చికిత్స చేయించుకునేందుకు రూ.5లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి వరంగా మారిందన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. నాయకులు సాజిద్, మురళీధర్రెడ్డి, దేవేందర్, లాల్ మహమ్మద్, శంకర్, దీపు తదితరులు పాల్గొన్నారు.