మహేశ్వరం : ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన ఆగమయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉండి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా అతనికి 1లక్ష యాబై వేల రూపాయలను మంజూరు చేసారు. అట్టి చెక్కును నగరంలోని మంత్రి నివాసంలో 13వవార్డు కౌన్సిలర్ ముప్పిడి లావణ్యరాజుతో కలిసి ఆయనకు అందజేసారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సహయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.