బడంగ్పేట : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని దవుద్ ఖాన్ గూడలో బస్తీ దవాఖాన భవన నిర్మాణానికి ఆమె శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వైద్యం అందు భాటులో ఉండే విధంగా కొత్తగా దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తరహ గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో , మెడ్చల్, సనత్ నగర్, వరంగల్ సూపర్ స్ఫెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని ఆమె పేర్కొన్నారు. నగరంతో పాటు మున్సిపల్, మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు.
మలక్ పేట, రాజేందర్ నగర్, బండ్లగూడలో, బడంగ్పేటలో నూతనంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయబోతున్నా మని ఆమె అన్నారు. కింది స్థాయి వరకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్య మంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. అందరికీ అందుభాటులో వైద్యం ఉంటుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి, డిఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్స్ సూర్ణ గంటి అర్జున్, బీమిడి స్వప్న జంగారెడ్డి, లిక్కి మమత క్రిష్ణరెడ్డి, తోట శ్రీధర్రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్రెడ్డి, రామోజీ అమిత శ్రీశైలం చారి, యాతం పవన్ యాదవ్, ఇంద్ర సేనా, పెద్ద బావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.