కవాడిగూడ: అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో రెయిన్బో హోం అనాథశ్రమంలోని వంద మంది బాలికలకు లింగాల చంద్రకళ రాందాస్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ లింగాల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నగర నాయకులు ముఠా జైసింహ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, లక్ష్మణ్ గౌడ్, బిక్షపతి యాదవ్, అక్లక్, నేత శ్రీనివాస్, ఆరిఫ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.