కాచిగూడ : కూతురు కోసం రైల్వేస్టేషన్కు వచ్చిన వ్యక్తి జేబులోంచి సెల్ఫోన్ దొంగతనం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన పాండురంగ (37) కూతురు యశ్వంత్పూర్ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్కు వచ్చింది.
కూతుర్ని రిసివ్ చేసుకోవడానికి పాండురంగ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-1లోని ఎక్స్లేటర్ సమీపంలో ఎదురుచూస్తుండగా అంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు తన ఖరీదైన సెల్ఫోన్ను జేబులోంచి దొంగిలించారు. వెంటనే కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.