ఎల్బీనగర్ : ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకుని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
మంగళవారం కొత్తపేట న్యూ మారుతీనగర్ చౌరస్తా నుండి కొత్తపేట మహిళా మండలి భవనం వరకు రూ. 3 లక్షల వ్యయంతో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్గౌడ్ సోంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీస్ వ్యవస్థ మరింత పఠిష్టంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్, బరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహననను పెంచుతున్నారన్నారు. ప్రస్తుతం తప్పు చేయాలంటే దొంగలు బయపడే రోజులు వచ్చాయన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సీసీ కెమెరాల అవశ్యకతను గుర్తించే తన శాసనసభ నిధుల నుండి రూ. 5 కోట్లు, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తాల నిధుల్లోంచి ఒక్కో కోటి చొప్పున మొత్తం 7 కోట్లను సీసీ కెమెరాలకు కేటాయించడం జరిగిందన్నారు.
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాలు బిగించాక నేరాలు, చోరీలు, స్నాచింగ్లు పూర్తిగా అరికట్టవచ్చన్నారు. 2023- 24 వరకు అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు.
మాజీ కార్పొరేటర్, కొత్తపేట శ్రీ ప్రసన్న మహాంకాళి దేవాలయ కమిటీ ఛైర్మన్ వజీర్ ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు తనవంతుగా సేవ చేసేందుకే సోంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్యపురి సీఐ రవికుమార్, టీఆర్ఎస్ యువజన నాయకులు బొగ్గారపు శరత్చంద్ర, వరుణ్చంద్ర, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి, శరణ్, షరీన్, అశోక్ జైన్, బాబు, బాలు తదితరులు పాల్గొన్నారు.