బంజారాహిల్స్ : పీకల దాకా మద్యం సేవించి ఆర్టీసీ బస్సులో ఎక్కి న్యూసెన్స్కు పాల్పడడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం సాయంత్రం కొండాపూర్ నుంచి బయలుదేరిన బస్సులో మాదాపూర్ స్టాఫ్లో మలక్పేటలోని చంచల్గూడ ప్రాంతానికి చెందిన తిమ్మిడి శ్రవణ్కుమార్ (24) అనే వ్యక్తి ఎక్కాడు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించిన శ్రవణ్ కుమార్ టికెట్ తీసుకోకపోగా కండెక్టర్తో పాటు ప్రయాణీకులతో వాగ్వాదానికి దిగాడు.
దాంతో జూబ్లీహిల్స్రోడ్ నెం 36 లోని నీరూస్ వద్దకు రాగానే బస్సును అపేసి కిందకు దింపేశారు. బస్సు బయలుదేరగానే శ్రవణ్కుమార్ వెనకనుంచి పెద్ద రాయిని తీసుకుని విసిరివేశాడు. దాంతో బస్సు వెనకవైపున అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు కండక్టర్ ఎంవీ.గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు శ్రవణ్కుమార్పై కేసు నమోదు చేశారు.