అబిడ్స్:మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. జాంబాగ్లోని పలు ప్రాంతాలలో శవయాత్ర నిర్వహించిన అనంతరం మొజాంజాహి చౌరస్తాలో దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ పార్టీ శాసనసభ్యుడు, ప్రజా నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
ఆయన తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎస్ ధన్రాజ్, సంతోష్ గుప్తా, ఆర్ శంకర్లాల్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్సింగ్, బి రమేష్ గుప్తా, శాంతిదేవి, ప్రియాగుప్తా, జై శంకర్, ప్రేమ్ అగర్వాల్, క్రాంతి, రాజారాం, యాదగిరి, తదితరులు శవయాత్రలో పాల్గొన్నారు.