సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్ఎస్కేవీ) ట్యాక్సీ సెక్టార్ సభ్యుడు డ్రైవర్ మురళిమోహన్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద, మర్రి రాజశేఖర్రెడ్డి చొరవతో రూ.1లక్ష 50వేల చెక్కు మంజూరైంది.
ఈ క్రమంలో శుక్రవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు చెక్కును మర్రి రాజశేఖర్రెడ్డి అందజేశారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుని బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న పేదలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షు డు నాగేశ్కుమార్, జాయింట్ సెక్రటరీ మహ్మద్ ఫహీముద్దీన్, ఆర్గనైజర్ సెక్రటరీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.