మియాపూర్ : పేదలకు సీఎం సహయనిధి వరం లాంటిదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అనారోగ్యం బారినపడి చికిత్సకు డబ్బులులేని పేదప్రజలకు సీఎం సహయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్కు చెందిన తులసి అత్యవసర చికిత్సనిమిత్తం సీఎం రిలీప్ఫండ్కు ధరఖాస్తుచేసుకొన్నారు. సీఎం సహయనిధిద్వారా మంజూరైన రూ.2,00,000ల చెక్కును ఆదివారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తోకలిసి ఆమెకు అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..పేదప్రజలు ఆపదలో ఉన్నసమయంలో సీఎం సహయనిధి ఆపన్నహస్తంలా ఆదుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ రంగారావు, వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, రఘునాధ్రెడ్డి, ఎరగుడ్ల శ్రీనివాస్యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్కుమార్ , నాయినేని చంద్రకాంత్రావు తదితరులు పాల్గొన్నారు.