ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్యలు మండిపడ్డారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు రాజీనామా చేయాలంటూ ఫోన్లు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని, మరో మారు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేస్తే బీజేపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మంగళ వారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
హుజురాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలవకపోతే రాజీనామా చేస్తానన్నావంటూ బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్, డీకె అరుణ, అరవింద్, ఈటెల రాజేందర్లు వారి అనుచరులు దళిత ఎమ్మెల్యేను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. దళిత ఎమ్మెల్యేను సోషల్ మీడియా ద్వారా వేధించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న కిషన్రెడ్డి, పసుపుబోర్డు తేకపోతే రాజీనామా చేస్తానన్న ఎంపీ అరవింద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తామన్న బండి సంజయ్లు ముందుగా తమ మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దళిత ఎమ్మెల్యేను సోషల్ మీడియా ద్వారా వేధించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్న, వారి వెనక ఉండి నడిపిస్తున్న బండి సంజయ్, అరవింద్, ఈటెల, డీకె అరుణల భరతం పడతామన్నారు. రేపటి నుంచి ఒక్క ఫోన్ కాల్ వచ్చినా గుర్తించి వారు ఎక్కడ ఉన్నా ఇళ్లమీద, భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు.
బీజేపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా దళిత ఎమ్మెల్యేకు వేల సంఖ్యలో ఫోన్లు చేయిస్తూ నీచ సంస్కృతిని ప్రదర్శిస్తుం దని, ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు మంచాల యాదగిరి, గంగారాం, అంజయ్య, పసులాది యాదగిరి, చందు, మల్లేష్, నాగరాజులు పాల్గొన్నారు.