మన్సూరాబాద్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్లో భోగి పండుగ ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు వైశ్య ఫెడరేషన్ మహిళా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అందమైన ముగ్గులను వేసి గొబ్బెమ్మలను అలంకరించారు. హరీదాస్ సంకీర్తనలతో గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తూ మేళతాళాల మధ్య బోగి మంటలను వేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సంస్కృతి, సాంప్ర దాయలకు ప్రతిబింభమైన సంక్రాతి విశిష్టతను యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ప్రతినిధులు చందా భాగ్యలక్ష్మీ, ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా, కటకం శ్రీనివాస్, ఆలేటి రవి తదితరులు పాల్గొన్నారు.