ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. జనప్రియ టౌన్షిప్ పక్కనున్న బల్దియా మైదానంలో జరిగిన ఈ సంబురాలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా వేదిక నుంచి మైదానం వరకు బతుకమ్మను తీసుకువెళ్లి మహిళలకు అందజేశారు.
డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ ఆటాపాటలతో అదరగొట్టారు. పాల్గొన్న ప్రతి మహిళకు ఎమ్మెల్యే గోపీనాథ్ తన తరపున కానుకలను పంపిణీ చేశారు. అందుకు కృతజ్ఞతగా మహిళలు గోపీనాథ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కంజర్ల పల్లవియాదవ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, ప్రధాన, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.