అమీర్పేట : సనత్నగర్ అమీర్పేట్ డివిజన్లలో దసరా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆయనతో పాటు అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ పాలక మండలి సభ్యులు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎం.హనుమంతరావులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో దేవాలయ ఈవో ఎస్. అన్నపూర్ణతో పాటు పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు, అశోక్కుమార్, బీఆర్ నారాయణరాజు, భూపాల్రెడ్డి, ఆంజనేయులు యాదవ్, ఉమానాథ్గౌడ్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, పుట్టల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.