ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్లోని 11 కేవీ ఆర్వోఎం, ఆజామాబాద్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, శాస్త్రీనగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్వోఎం ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, హిమాయత్నగర్ తహసీల్దార్ కార్యాలయం, రాజేంద్ర ఆయిల్ మిల్, సోప్ ఫ్యాక్టరీ, అచ్చయ్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆజామాబాద్ ఫీడర్ పరిధిలోని రాంనగర్, ఆజామాబాద్, ఘరొండ అపార్టుమెంట్, బయాలోజికల్ ఈ కంపెనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఫీడర్ పరిధిలోని రిసాల, హరినగర్, అంబేద్కర్నగర్, అచ్చయ్యనగర్, అల్లాడి రాజ్కుమార్ నగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
శాస్త్రీనగర్ ఫీడర్ పరిధిలోని రాంనగర్, శాస్త్రీనగర్, మోహన్నగర్, జెమినీ కాలనీ, సెయింట్ పాయిస్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.