బడంగ్పేట : ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 29, 34, 35 డివిజన్లలో రూ.2,34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల సుందరీకరణ, నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంక్లను నిర్మిస్తున్నామన్నారు. అవుట్ లెట్ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. లెనిన్ నగర్ చౌరస్తా నుంచి బడంగ్పేట కమాన్ వరకు రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
రోడ్డు నిర్మాణానికి రూ. 1.50 కోట్లు కేటాయించామన్నారు. రూ.45 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామన్నారు. లెనిన్ నగర్ కట్టను విస్తరణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని వర్గాలను ఆదుకుంటున్న సీఎం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి సీఎం కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద నియోజక వర్గానికి 100 మంది లబ్ధి దారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ హాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి, కార్పొటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు చవ్వ మణెమ్మ, సిద్దాల బీరప్ప పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై..
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సాయిలు మంత్రి సమక్షంలో చేరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు.