బంజారాహిల్స్: ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఉత్తేజ్ సతీమణి పద్మావతి సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడంతో పాటు ఆయన చేపట్టే సేవా కార్యక్రమాల్లో పద్మావతి పాలుపంచుకునేది.
కాగా పద్మావతి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు క్యాన్సర్ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తేజ్తో పాటు ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. జీవితా రాజశేఖర్. ప్రకాష్రాజ్, బ్రహ్మాజీ, ఏడిద శ్రీరామ్తో పాటు పలువురు ఆస్పత్రికి వచ్చి ఉత్తేజ్ను ఓదార్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని బోరబండలోని ఉత్తేజ్ ఇంటికి తరలించారు.