రామగిరి, ఏప్రిల్ 26 : నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం త్రం 5గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలోక్ అరాధేతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్ కుమార్, కె.లక్ష్మణ్, బి.విజయ్ సేన్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. అలోక్ అరాధే కోర్టు భవనాల ప్రారంభోత్సవం కంటే ముందు నల్లగొండలోని పానగల్ చాయా సోమేశ్వరాలయం సందర్శించి పూజలు నిర్వహించనున్నారు.