ఎర్రగడ్డ : మహిళల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు జనరంజకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ గోపీనాథ్ చెక్కుతో పాటు తన తరపున ఒక్కో కానుకను అందజేశారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, కంజర్ల పల్లవియాదవ్, డివిజన్ ప్రధాన, అనుబంధ కమిటీల నేతలు, వార్డుకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.